YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎంకు అండగా నిలువాలి మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి

ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎంకు అండగా నిలువాలి              మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి

మ్యానిఫెస్టోలో పెట్టని, పెట్టిన అన్ని, అనేక పథకాలను సీఎం అమలు చేస్తున్నారు మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎంకు అండగా ప్రజలుండాలి. పది కాలాల పాటు ఆయనే సీఎంగా ఉండాలని దీవించాలని కోరారు.   ఇది గతంలో ఎక్కడా ఎప్పుడూ లేని పథకం.గత పాలకులకు తట్టని ఆలోచన సీఎం కేసీఆర్ చేశారన్నారు.గురువారం బాలానగర్ మండలం ఉడిత్యాలలో రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు పట్టా పాసుపుస్తకాలు, పంటపెట్టుబడుల చెక్కులు పంపిణీ చేశారు.మంత్రి లక్ష్మారెడ్డి ఉడిత్యాలకు చెందిన హైమావతి అనే దివ్యాంగురాలు వద్దకు వెళ్లి..ఆమెకు పాసు పుస్తకంతోపాటు రూ.16,500 చెక్కుని అందజేశారు. అనంతరం పదవీ విరమణ చేసి అనారోగ్యంతో బాధ పడుతున్న వీఆర్వో పాండయ్యను పరామర్శించారు. ఆయనకు పాసుపుస్తకం, రూ.6,500 చెక్కును అందజేశారు. పాండయ్య కు తగిన చికిత్స అందిస్తామని హామీనిచ్చారు.రైతుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రభుత్వ ఆర్థిక సహాయ పథకమే రైతు బంధు అన్నారు. రైతు బంధు ద్వారా ప్రభుత్వమే పూర్తి ఉచితంగా పంటల పెట్టుబడి ని అందిస్తున్నదని చెప్పారు. మన అభివృద్ధిని, క్షేమాన్ని, సంక్షేమాన్ని మనమే నిర్ణయించుకోవాలని నిర్దేశించారు. వర్షాన్ని సైతం లెక్క చేయక కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు మంత్రి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Related Posts