తప్పుడు దృవీకరణలతో క్రీడాకారుల కోటా కింద గతంలో కొందరు మెడికల్ సీట్లు పొందినట్లు వస్తున్న ఆరోపణలపై ఏసీబీ విచారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. ఎంబిబియస్ సీట్లు పొందడానికి స్పోర్ట్స్ కోటాను దుర్వినియోగపరుస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఈ అక్రమాలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు