మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెల 8,9వ తేదీల్లో రెండురోజులపాటు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో చేప మందు(ప్రసాదం) పంపిణీ చేస్తామని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు.గురువారం ఎక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ వంశపారంపర్యంగా వస్తున్న చేప ప్రసాదం పంపిణీని నిస్వార్థంగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పారు. చేపప్రసాదం తీసుకున్న తర్వాత 40 రోజుల పాటు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఉబ్బసం, శ్వాస సంబంధిత రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి భారీగా ప్రజలు తరలివస్తారని.. జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్టీసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు సహకరించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని హరినాథ్ గౌడ్ వివరించారు.