YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వచ్చే డిసెంబర్ కల్లా చెనక కొరట బ్యారేజ్ నీరు : మంత్రి జోగు రామన్న

వచ్చే డిసెంబర్ కల్లా చెనక కొరట బ్యారేజ్ నీరు : మంత్రి జోగు రామన్న

ఉత్తమ్  కుమార్ రెడ్డి మతిస్థిమితం లేకుండా  తప్పి మాట్లాడుతున్నారు . బస్సు యాత్ర కాదు జనానికి నరక యాత్ర అని మత్రి జోగు రామన్న వ్యాఖ్యానించారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ఇరవై ఏళ్ల వరకు కెసిఆర్ ను  గద్దె దింపడం ఎవరితరం కాదు. కాంగ్రెస్ పార్టీ మోసాలు పాపాలు లంచాల పార్టీ అని అన్నారు. ఫారెస్టు భూములు లాక్కుంటున్నారని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు జనం ఎవరూ నమ్మరు. ప్రాణహిత చేవెళ్ళపై కాంగ్రెస్ నేతలు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు అది గ్రావిటీ ప్రాజెక్టు కాదని అన్నారు.  పాపాలు.. మోసాలు.... ప్రజా ధనాన్ని  దోచుకునే పార్టీ కాంగ్రెస్  పార్టీ.  తమ ప్రభుత్వ పాలనపై టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని అన్నారు.  70 ఎళ్ల పాలనలో రాష్టాన్ని దారిద్ర్య రేఖకు తీసుకెళ్లారు.  రాజకీయ లబ్ది కోసమే తమ పై కాంగ్రెస్ నేతల దృష్ప్రాచారం చేస్తున్నారని అన్నారు.   వచ్చే డిసెంబర్ కల్లా చెనక కొరట బ్యారేజ్ ద్వారా సాగు నీరు అందించి తీరుతామన్నారు.    జిల్లాలో  కలప స్మగ్లింగ్ ను అరికడతాం.. సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖబర్దార్  అని మంత్రి హెచ్చరించారు. 

Related Posts