YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు

భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు

న్యూఢిల్లీ :
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది.  గడిచిన 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. సోమవారం తో  పోలిస్తే 28.7శాతం తక్కువని పేర్కొంది. తాజాగా వైరస్తో 19 మంది మృతి చెందగా.. 24 గంటల్లో 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,25,370కి పెరిగింది. ఇందులో 4,25,84,710 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,24,260 మంది ప్రాణాలు వదిలారు. దేశంలో ప్రస్తుతం 16,400 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం చెప్పింది. జాతీయ కొవిడ్ రికవరీ రేటు 98.75శాతంగా ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 10.78లక్షల కొవిడ్ టీకాలు వేయగా.. ఇప్పటి వరకు 1,91,48,94,858 డోసులు వేసినట్లు వివరించింది. నిన్న 2,97,242 కొవిడ్ టెస్టులు చేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. తాజాగా అత్యధికంగా కేసులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఢిల్లీలో 377, కేరళలో 321, హర్యానాలో 218, ఉత్తరప్రదేశ్లో 138, మహారాష్ట్రలో 129 కేసులు రికార్డయ్యాయని, కొత్త కేసుల్లో దాదాపు 75శాతానికి పైగా ఈ ఐదు రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని పేర్కోంది.

Related Posts