YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు..

జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు..

న్యూఢిల్లీ 9,
జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది. అవసరమనుకుంటే ప్రత్యేక చట్టాలు కూడా చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే.. కేంద్ర, రాష్ట్ర ట్యాక్స్‌ అంటూ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఇప్పటికే ఎంతో మంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో జీఎస్టీపై పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం తాజాగా ఈ సంచనల తీర్పునిచ్చింది. అయితే.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో.. సామాన్యుడిపై ట్యాక్సుల భారం తగ్గే అవకాశం కనిపిస్తోంది. వస్తు సేవల పన్ను (GST)పై చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర, రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయని జస్టిస్ డివై చంద్రచూడ్  నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆచరణీయ పరిష్కారాన్ని సాధించడానికి జీఎస్‌టీ కౌన్సిల్ సామరస్యపూర్వకంగా పని చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఆర్టికల్ 246ఏ ప్రకారం పన్నులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చని తెలిపింది. ఒకరి ఆదేశాలను మరొకరిపై రుద్దవద్దని పేర్కొంది.2007 ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (IGST) చట్టం ప్రకారం సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించిన గుజరాత్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌పై సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. ఓడలో వస్తువుల రవాణా సేవలపై ఐదు శాతం ఐజీఎస్టీ విధించాలని 2017 ప్రభుత్వ నోటిపికేషన్‌ను హైకోర్టు రద్దు చేయడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు. కాగా GST, IGST రూపాల్లో ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Related Posts