YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫేస్ బుక్ అధికారితో మంత్రి లోకేష్ భేటీ

ఫేస్ బుక్ అధికారితో మంత్రి లోకేష్ భేటీ

ఢిల్లీ లోని ఏపీ భవన్ లో ఫేస్ బుక్ ఇండియా గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఔట్ రీచ్ మేనేజర్ నితిన్ సలుజా శుక్రవారం నాడు మంత్రి నారా లోకేష్ ని కలిసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచెయ్యడానికి ఫేస్ బుక్ ముందుకి వచ్చిందని అయన మంత్రికి వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు,వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఫేస్ బుక్ ఫ్లాట్ ఫార్మ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు  ఫేస్ బుక్ సుముఖంగా వున్నట్లు అయన వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చెయ్యడంలో ఫేస్ బుక్ తో ఒప్పందం ఉపయోగపడుతుందని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు.  రాష్ట్రానికి రావాలని ఫేస్ బుక్ ప్రతినిధులకు మంత్రి ఆహ్వానించారు. 

Related Posts