YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మత్స్యకారులకు అండగా వుంటాను : పవన్ కళ్యాణ్

మత్స్యకారులకు అండగా వుంటాను : పవన్ కళ్యాణ్

జనసేన అదినేత పవన్ కళ్యాణ శుక్రవారం నాడు విశాఖ జిల్లా  పెద్దగంట్యాడ మండలం  గంగవరం గ్రామం లో పర్యటించారు. గంగవరం పోర్టు నిర్వాసితులు సమస్యలు అడిగితెలుసుకున్నారు. గంగవరం పోర్టు నిర్వాసితులకు న్యాయం చెస్తానని అయన భరోసా ఇచ్చారు. పవన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పై నిరంతర పోరాటానికి నేను సిద్దంగా ఉన్నానని అన్నారు. అభివృద్ధికి దూరంగా గ్రామంను ఉంచి, గంగవరం పోర్ట్ కాలుష్యం వలన గ్రామంలో చిన్న పిల్లలు, మహిళలకు అనారోగ్యాలకు గురి అవుతున్నారు. ప్రభుత్వం తమ పై జాలీ చూపించడం లేదు అని స్థానికులు వాపోయారు.  వారి సమస్యలను ప్రభుత్వ దృష్టీకి తీసుకువెళ్ళి పరిష్కరం అయిన విధంగా పోరాడుతాను అని పవన్ అన్నారు. పవన్ పర్యటనలో భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గోన్నారు. కొంత మంది మంది కార్యకర్తలు, బౌన్సర్లు మీడియా పై దాడి చేయడంతో కొంత మంది మీడియా ప్రతినిధుల గాయాలు అయ్యాయి.

Related Posts