YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెపో రేట్లను పెంచిన ఆర్బీఐ

రెపో రేట్లను పెంచిన ఆర్బీఐ

ముంబాయి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక వడ్డీరేట్లను పెంచింది. ద్రవ్యోల్భణాన్ని అదుపులోకి తెచ్చేందుకుగానూ రెపో రేటును పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ బుధవారం ప్రకటించారు. ఆర్బీఐ మే నెలలోనే రెపోరేట్ను 40 పాయింట్లు పెంచగా, ఇప్పుడు  మరో 50 బేసిస్ పాయింట్లు పెంచారు. తాజా పెంపుతో కలుపుకుని రెపో రేటు 4.90 శాతానికి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెపో రేటును 5.5శాతానికి పెంచనున్నట్లు సమాచారం.  కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లు పెంచే అవకాశముంది. దీంతో సామాన్యుడికి లోన్లు, ఇతర ఈఎంఐలు భారం మరింత పడనుంది. హోం, కార్, పర్సనల్ లోన్ లు మరింత భారం అవుతాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.2శాతంగా నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. కాగా ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్భణం 7.79శాతానికి చేరింది. జనవరిలో నమోదైన దానికంటే ఇది 6 శాతం ఎక్కువ  అయింది.

Related Posts