YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కోహ్లీ కెప్టెన్సీ ఫై ధోని వ్యాఖ్యలు..!!

కోహ్లీ కెప్టెన్సీ ఫై ధోని వ్యాఖ్యలు..!!

 నిన్న జరిగిన మ్యాచ్ అనంతరం చెన్నై ఆటగాళ్లు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.  ఈ క్రమంలో ఓ అభిమాని ‘కోహ్లీ కెప్టెన్సీ ఎలా ఉంది?’ అని ధోనీని అడిగారు. వెంటనే ధోనీ ‘వెరీగుడ్‌’ అని బదులిచ్చాడు. దీంతో ఆ ప్రాంగణమంతా నవ్వులు విరిశాయి. అంతకుముందు మరో అభిమాని ‘కెప్టెన్సీని ఇష్టపడతారా లేదంటే జట్టులో సాధారణ ఆటగాడిలా ఉండటం ఇష్టమా?’ అని అడగ్గా ‘ముందుగా సాధారణ ప్లేయర్‌గా ఉండటం ప్రతి ఆటగాడికి ఎంతో ముఖ్యం. అప్పుడే ఆటను, ఆటగాళ్లను అర్థం చేసుకోగలం. ఇంకా ఎన్నో నేర్చుకోవచ్చు’ అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో  ధోనీతో పాటు జడేజా, హర్భజన్‌సింగ్‌, రైనా, బ్రావో కూడా పాల్గొన్నారు.

Related Posts