అవినీతి నిరోధక శాఖ గాలానికి మరో అవినీతి చేప దొరికింది. మలక్ పేట ఆర్టిఏ అధికారిగా పనిచేస్తున్న నాగరాజు ఒక బాధితుడినుంచి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఓ కారు కు ఎన్వోసీ సర్టిఫికెట్ కావాలని ఓ వ్యక్తి నాగరాజు దగ్గరికి వచ్చి అడుగగా రూ 5 వేలు ఇవ్వాలని చెబితే బాధితుడు సరే అన్నాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ లో రూ 5 వేలు నాగరాజు కు ఇస్తుండగా ఏసిబి అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. లంచం తీసుకున్న డబ్బును ఏసిబి ఆదాకారులు స్వాధీనం చేసుకున్నారు. మారేడుపల్లి లో వున్న నాగరాజు ఇంట్లో కుడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.