గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రేడర్లు తమ లైసెన్స్లను ఈ నెల 30వ తేదీలోగా రెన్యువల్ చేయించుకోవాలని, లేనట్టయితే 50శాతం జరిమానా విధించడం జరుగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి తెలిపారు. మే 31 నుండి రెన్యువల్ చేయించుకొనే ట్రేడ్ లైసెన్స్లకు 50శాతం పెనాల్టీ విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ ట్రేడ్ లైసెన్స్లను ఆన్లైన్ ద్వారా ఫీజులను చెల్లించి ప్రోవిజనల్ ట్రేడ్ లైసెన్స్లను పొందవచ్చని తెలియజేవారు. ఇప్పటి వరకు ట్రేడ్ లైసెన్స్లు పొందని వారు కొత్తగా ఆన్లైన్ ద్వారాగానీ, ఈ-సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటీజన్ సర్వీస్ సెంటర్లో, జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో ట్రేడ్ లైసెన్స్లను పొందాలని అన్నారు. మరిన్ని వివరాలకు జీహెచ్ఎంసీ వెబ్సైట్ www.ghmc.gov.in లో వివరాలు తెలుసుకోవాలని కోరారు.