కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో పరిణామాలు, రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. మరికాసేపట్లో అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో వేగంగా పార్టీల బలాబలాలు మారుతున్నాయి. కాంగ్రెస్ గూటి నుంచి జారిపోయి బీజేపీ వైపు ఆకర్షితులైనట్టు భావించిన ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ అసెంబ్లీ చేరుకున్నారు. మరో ‘మిస్సింగ్’ ఎమ్మెల్యే ఆనంద్సింగ్ కూడా గోల్డ్ఫించ్ హోటల్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. గతంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీకే ఓటేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పటిష్టమైన పోలీసుల భద్రత మధ్య ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాగానే.. వారిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్యలోనే వారు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్సింగ్, ప్రతాపగౌడ కాంగ్రెస్కు ద్రోహం చేయబోరని ఆ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ తెలిపారు.ఇటు బలపరీక్ష దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ శిబిరంలో టెన్షన్ పెరిగిపోతోంది.