YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ముంబైకి షాక్ ఇచ్చిన ఢిల్లీ.. !!

Highlights

  • రాణించిన ఢిల్లీ  బౌలర్లు  
  • మెరిసిన రిషబ్ పంత్ 
  •  ముంబై అవుట్.
 ముంబైకి షాక్ ఇచ్చిన ఢిల్లీ.. !!

 ముంబైని ఢిల్లీ ముంచేసింది. ఈ ఓటమితో టోర్నీ నుంచి ముంబై నిష్క్రమిచ్చింది. ఢిల్లీతో ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై 11 పరుగులతో ఓడిపోయింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోదిగిన ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. లూయిస్‌ (31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48), కటింగ్‌ (20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37), హార్దిక్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 27) మాత్రమే పోరాడారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అమిత్‌ మిశ్రా (3/19), హర్షల్‌ పటేల్‌ (3/28), లామిచానె (3/36) అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేశారు. అంతకుముందు ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64) అద్భుత ఫామ్‌ కొనసాగించి హాఫ్‌ సెంచరీ చేయగా..విజయ్‌ శంకర్‌ (30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 నాటౌట్‌) రాణించాడు. 

Related Posts