YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పసిడి బాటలో వైట్ మెటల్

పసిడి బాటలో వైట్ మెటల్

ముంబై, జూలై 21,
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీరు ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. మన దేశంలో పసిడి రేట్లను గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ప్రభావితం చేస్తాయి. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో కూడా గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. అయితే దేశీ మార్కెట్‌లో మాత్రం పసిడి రేటు పెరుగుతూ వస్తోంది. గోల్డ్ రేటు గత రెండు రోజులుగా ఇదే దారిలో పయనిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు పడిపోయింది. 0.46 శాతం క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1692 డాలర్లకు దిగి వచ్చింది. బంగారం రేటుకు 1700 డాలర్ల వద్ద మద్దతు లభిస్తోంది. అయితే పసిడి రేటు ఈ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. దీంతో బంగారం ధరలు మరింత తగ్గొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ రేటు ఔన్స్‌కు 0.44 శాతం పడిపోయింది. 18.58 డాలర్ల వద్ద కదలాడుతోంది.
దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో పసిడి రేటు జూలై 21న రూ. 110 పెరిగింది. దీంతో బంగారం ధర రూ. 50,620కు చేరింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు అయితే రూ. 100 పెరిగింది. దీంతో తులం రేటు రూ. 46,400కు చేరింది. బంగారం ధరలు పెరగడం ఇది వరుసగా రెండో రోజు. నిన్న కూడా పసిడి రేటు పైపైకి చేరింది. రూ. 120 పెరిగింది. ఇక వెండి రేటు చూస్తే.. రూ. 300 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 61 వేలకు ఎగసింది.బంగారం ధరలు పడిపోవడానికి రెండు అంశాలు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఫెడ్ రేటు వడ్డీ రేటు పెంపు అంచనాలు పసిడిపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈసారి మీటింగ్‌లో ఫెడ్ రేటు 100 బేసిస్ పాయింట్ల వరకు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అలాగే అమెరికా డాలర్ గరిష్ట స్థాయిలో కదలాడుతూ ఉండటం మరో అంశం. దీని వల్ల బంగారంపై ఒత్తిడి నెలకొంది.

Related Posts