YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జ‌న‌సేన నిర‌స‌న క‌వాతు విజ‌య‌వంతం

జ‌న‌సేన నిర‌స‌న క‌వాతు విజ‌య‌వంతం

ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల సాధ‌నే ల‌క్ష్యంగా జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు నిర‌స‌న క‌వాతు చేశారు.  ఇచ్ఛాపురంలోని దాస‌న్న‌ప‌ల్లి కూడ‌లి నుంచి రాజావారి మైదానం వ‌ర‌కు ఈ క‌వాతు సాగింది. దాస‌న్న‌ప‌ల్లి కూడ‌లి నుంచి స‌భాప్రాంగ‌ణం వ‌ర‌కు రోడ్డు జ‌నంతో కిక్కిరిసిపోయింది.  ఇచ్ఛాపురం ప్ర‌ధాన ర‌హ‌దారి జ‌న‌సేన జెండాల‌తో నిండిపోయింది.  దారిపొడువునా కార్య‌క‌ర్త‌ల‌కు, అభిమానుల‌కు జ‌న‌సేన అధినేత అభివాదం చేస్తూ ముందుకు క‌దిలారు.  క‌వాతు జ‌రుగుతున్నంత సేపు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల నినాదాల‌తో రోడ్లు మార్మోగాయి.  జ‌న‌సేన అధినేత‌తో అడుగు వేయ‌డానికి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పోటీ ప‌డ్డారు. నిర‌స‌న క‌వాతులో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.  జ‌న‌సేన పోరాట యాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన తొలి క‌వాతు వేలాది మంది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిరావ‌డంతో విజ‌య‌వంతం అయ్యింది.

Related Posts