YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కోడి ఈకలతో కోట్లు.....

కోడి ఈకలతో కోట్లు.....

జైపూర్, సెప్టెంబర్ 30, 
ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. ఈ పదాన్ని తరచూ వింటూ ఉంటాం. కాని కొన్ని సందర్భాల్లో వాస్తవరూపం దాలుస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇదెందుకు పనికిరాదని తీసి పాడేస్తాం. అసలు కొన్ని వస్తువులయితే ఇదో చెత్త.. అంటూ ఆ వస్తువులను ముట్టుకోవాలంటేనే చిరాకు. కాని అలాంటి పనికిరాని వస్తువలే కోట్లుతెచ్చిపెడతాయంటే నమశ్చక్యం కాదు. ఇలాంటి జాబితాలో ఎన్నో వస్తువులు ఉన్నాయి. సాధారణంగా ఇంట్లో చిరిగిన బట్టలు లేదా న్యూస్ పేపర్లతో ఇంట్లో డెకరేషన్ కు సంబంధించిన చిన్న చిన్న వస్తువులు తయారుచేస్తూ ఉంటారు ఇంట్లో మహిళలు. తమ ఆలోచనలకు మరింత సృజనాత్మకతను జోడిస్తూ ఉంటారు. ఒక్కోసారి అలా చిన్నగా ప్రారంభించి అదో కుటీర పరిశ్రమగా కూడా మారుతూ ఉంటుంది. ఇవ్వన్నీ మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కో సరైన ఆలోచన రావాలే గాని.. అది క్లిక్ అయితే మన జీవిత స్వరూపాన్నే మార్చేస్తుంది. అలా ఒక చిన్న ఐడియాతో వ్యాపారాలు ప్రారంభించి కోట్లు సంపాదిస్తున్న వాళ్లని ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. కాని ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం నిజంగా ఓ వండర్ అనే చెప్పుకోవాలి. కోడి మాంసం అంటే చాలా మంది లొట్టలేసుకుని తినేస్తూ ఉంటారు.. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు.. అయినా కోడి ఈకలంటే చాలా మందికి పడదు. ఈకలతో ఉన్న కోడిని పట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కాని ఓ జంట మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ఇంకేముందు అవే కోడి ఈకలతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షర సత్యం. ఇంతకీ దంపతులు ఎవరు.. ఏ ప్రాంతానికి చెందిన వారో తెలుసుకోవాలనుకుంటున్నారా.. రీడ్ దిస్ స్టోరీ.వ్యర్థాలతో కంపోస్ట్ చేయడం, ఇంకా చెప్పాలంటే వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడం మనందరికి తెలుసు. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు కూడా చెత్త నుంచి సంపద అనే నినాదాన్ని తీసుకున్నాయి. కాని మనం తొడుక్కునే దుస్తులు కూడా వ్యర్థాలతో తయారుచేయవచ్చని నిరూపించారు జైపూరుకు చెందిన ముదిత, రాజేష్ దంపతులు. కోడి ఈకలతో మనం ధరించే దుస్తులు తయారుచేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మొదట్లో వీరి ఐడియాను చూసి వెక్కిరించిన వారిని ఆశ్చర్యపోయేలా చేశారు ఈ దంపతులుకాలేజీలో చదవుతున్నప్పుడు వచ్చిన ఈ ఆలోచనను వ్యాపారంగా మార్చారు. అయితే ఈ ఆలోచనను ఆచరణలో పెట్టి కోట్ల రూపాయలు సంపాదించడం అంత తేలికగా జరగలేదు. తనకు వచ్చిన ఆలోచనను కార్యరూపం దాల్చడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మధ్యలో పరిస్థితులు అనుకూలించలేదు. అయినా సరే మొక్కవోని లక్ష్యంతో ముందుకెళ్తూ కోడి ఈకలతో దుస్తులు తయారుచేస్తూ ఏకంగా ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు ఈ దంపుతులు కోట్లలో టర్నోవర్ ని సొంతం చేసుకున్నారు. జైపూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్లో రాధేష్ తో కలిసి ముదిత ఎంఏ చేస్తున్నప్పుడు వ్యర్థ పదార్థాలతో కొత్త వస్తువులను తయారుచేసే దానిపై ఓ ప్రాజెక్టు చేశారు. ఒకరోజు రాధేష్ ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ పొరుగున ఉన్న ఓ చికెన్ దుకాణంలో నిలబడి ఉండగా.. కోడి ఈకలను చేతితో తాకాడు రాధేష్. అనుకోకుండా అతడికి ఓ ఆలోచన వచ్చింది. దానిని ముదితతో చెప్పగా.. ఇద్దరూ కలిసి వెంటనే దానిని ప్రాజెక్ట్ గా మార్చారు. ఆ ఐడియాతో ఇద్దరూ కలిసి వ్యాపారం మొదలు పెట్టాలని నిర్ణయించారు. అయితే వారి ఆలోచన కార్యరూపం దాల్చడానికి సుమారు 8 సంవత్సరాలు పట్టింది.2010లో ప్రారంభమైన వారి ఆలోచన 2018లో కార్యరూపం దాల్చింది. దీనికోసం వారు ఎంతో కష్టపడ్డారు కూడా. వాస్తవానికి రాధేష్ కుటుంబం పూర్తి శాఖాహర కుటుంబం. దీంతో వారి కుటుంబ సభ్యులు ఈ వ్యాపారాన్ని నిరాకరించారు. వ్యాపార పనులు జరుగుతున్నప్పుడు కూడా రాధేష్ కుటుంబం ఎటువంటి సహకారం అందిచలేదు. ఆసమయంలో ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా సరే ఇబ్బందులు పడుతూనే తమ లక్ష్యం వైపు అడుగులు వేశారు రాధేష్, ముదిత దంపతులు. గతంలో కోడి ఈకలతో దుస్తులు తయారుచేసే వ్యాపారాన్ని ఎవరూ చేసిన దాఖలాలు లేవు. బుక్స్, ఇంటర్నెట్ లోనూ దానికి సంబంధించిన సమాచారం లేదు. అయితే ఎంతో రీసెర్చ్ తర్వాత కోడి ఈకలను దుస్తులుగా మార్చే ఒక పద్ధతిని కనుగొన్నారు. అయితే కోడి ఈకలను ఉపయోగించి దుస్తులు తయారుచేయడం వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. తయారుచేసిన దుస్తుల సేల్స్ వీరికి కష్టతరంగా మారింది. సాధారణంగా కోడి ఈకలతో తయారుచేసిన దుస్తులంటే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే కోడి ఈకలతో తయారుచేసిన శాలువాలకు భారత్ తో పోలిస్తే విదేశాల్లో అధిక డిమాండ్ ఉందని తెలుసుకుని అప్పటి నుంచి వారి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమైన వారి ఆలోచన ఇప్పుడు ఓ పరిశ్రమగా రూపుదిద్దుకుంది. గత రెండేళ్లలో ఐదు కోట్లకు పైగా వ్యాపారం చేయగా.. ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.2.5 కోట్లకు చేరింది. అంతేకాదు ఈ కంపెనీలో సుమారు 1200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కళాశాల స్థాయిలో పుట్టిన ఒక ఆలోచన నేడు వందలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో ఇప్పుడు ఈ న్యూస్ ట్రెండింగ్ అవుతోంది.

Related Posts