YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ టూర్ రద్దు

మోడీ టూర్ రద్దు

హైదరాబాద్, అక్టోబరు 4 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన రద్దయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెచ్ఐసీసీలో జరిగే యూఎన్‌డబ్లూజీఏసీ సదస్సులో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా యుఎన్‌డబ్ల్యూజీఐసీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకానుంది. అలాగే 120 దేశాలకు చెందిన సుమారు 2వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత.. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించనుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

Related Posts