YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మండే సూరీడు....

మండే సూరీడు....

మే నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో 15 రోజులపాటు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగత్రలు నమోదువుతోంది. వరుణుడు అకాల వర్షాలు కురిపించినప్పుడు మాత్రమే ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి జిల్లాల వాసులకు సైతం రెండు రోజుల నుంచి ఎండ దెబ్బకు చుక్కలు కనపడ్డాయి. ఇటీవల ఎన్నడూ లేని విధంగా శనివారం మూడు జిల్లా కేంద్రాల్లో అటూఇటుగా 43 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. తేడా లేనంతగా ఉడికిపోయారు. బయటకి రాగానే ఐదు నిమిషాలకే సొమ్మసిల్లి పడిపోయేంత వేడి శరీరానికి తాకడంతో చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేటలో ఆదివారం రికార్డు స్థాయిలో 43.9 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. మూడు జిల్లాలోనూ మూడు రోజుల నుంచి రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తొలకరి జల్లులు ఈసారి రెండురోజులు ముందుగానే రాష్ట్రాన్ని పలకరిస్తాయన్న విషయాన్ని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు వరకు కేరళ తీరాన్ని తాకుతాయని.. జూన్‌ మొదటి వారంలో రాష్ట్రానికి  చేరుకుంటాయని చల్లని కబురు అందించారు. ఇది విన్న భానుడు తన ప్రతాపాన్ని చూపించాలనుకున్నాడేమో అన్నంతగా  చెలరేగిపోతున్నాడు. చివరి రోజుల్లో విజృంభించి రికార్డుస్థాయిలో ఎండలను కురిపిస్తున్నాడు. మూడు రోజుల నుంచి ప్రజలు బయటకు రావటానికి అల్లాడిపోతున్నారు.గడిచిన మూడు రోజుల నుంచి ఉదయం 9 గంటలకే 38 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పైగా ఉష్ణోగత్ర నమోదవుతోంది.  తిరుమలగిరిలోని ఐఎండీ కేంద్రంలో నమోదైన వివరాల మేరకు.. సూర్యాపేట జిల్లాలో ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రత 39 డిగ్రీలకు చేరుకుంటోంది. గంట గంటకు పెరుగుతూ.. మధ్యాహ్నం వరకు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సాయంత్రం 5.30 గంటలు దాటినా 35కు పైగా డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఎండలు 42 డిగ్రీలు దాటితే మానవ శరీరానికి హాని కలిగించే అతినీల లోహిత కిరణాలు 7 నుంచి 8 శాతం నమోదవుతున్నట్లు వారు గుర్తించారు. ఒత్తిడితో కూడిన వడగాలులు 15 కిలోమీటర్ల వేగంతో వీచినట్లు నమోదైంది. ఇలాంటి సమయంలో ఎండలో తిరిగితే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కంటి చూపుపై ఇవి ప్రభావం చూపిస్తాయని చివ్వెంల వైద్యాధికారి శ్రీనివాసరాజు వెల్లడించారు. క్యాటరాక్ట్‌, కార్నియా తదితర కంటి భాగాలపై ప్రభావం చూపుతాయన్నారు. చర్మసంబంధ వ్యాధులు ప్రారంభమై దీర్ఘకాలంలో కేన్సర్‌గా మారే ముప్పు ఉన్నట్లు వివరించారు. తలనొప్పి, అలసట, ఆయాసం, వడదెబ్బలకు గురయ్యే ప్రమాదాలు ఉంటాయన్నారు. వీటి బారిన పడకుండా ఉంటాలంటే జాగ్రత్తలు పాటించాలని సూచించారుఉష్ణోగ్రతల ప్రభావంతో విద్యుత్తు వినియోగం అసాధారణంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వేడిమి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లను నిరంతరం ఉపయోగిస్తున్నారు. దీంతో విద్యుత్తు వినియోగం సాధారణానికి మించి నమోదవుతోంది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సాధారణ వినియోగం కన్నా రోజుకు 200 నుంచి 300 మెగావాట్ల విద్యుత్తు అదనపు డిమాండ్‌ వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సైతం వినియోగం పెరిగిపోవడంతో ఈమేరకు డిమాండ్‌ వస్తున్నట్లు గుర్తించారు.

Related Posts