YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అగ్రిగోల్డ్ నిందితుడు సీతారాం ఆరెస్టు

అగ్రిగోల్డ్ నిందితుడు సీతారాం ఆరెస్టు

అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితుడిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పరారీలో  ఉన్న అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ అవ్వా సీతారాంను ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు ఢిల్లీ శివారు గుర్గావ్లో అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరు పరిచారు. ట్రాన్సిట్ వారెంట్పై ఆయనను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  సీతారాం ముందస్తు బెయిల్ ను  సుప్రీం కోర్టులో తిరిస్కరించడంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. సీతారాం అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకట రామారావు సోదరుడు. ఈ కేసులో ఇప్పటికే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు సహా తొమ్మిదిమంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

కాగా పైసాపైసా కూడబెట్టుకున్న పేదలు అధికవడ్డీ ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేస్తే జనం సొమ్ముతో వేల ఎకరాలు కొనుగోలు చేసిన ఆ సంస్థ యాజమాన్యం చివరకు డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేసింది. సాధారణంగానైతే ఆ సంస్థ ఆస్తులన్నీ అమ్మి డిపాజిటర్లకు చెల్లించాలి. కానీ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కయిన ప్రభుత్వ పెద్దలు డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెడుతూ విలువైన ఆస్తులన్నిటినీ కైంకర్యం చేసేశారు.  అనేక మంది రాజకీయ నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోప ణలున్నాయి. దీంతో తమకు న్యాయం జరిపించాలని బాధితులు కోర్టును ఆశ్రయించారు

Related Posts