YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ట్విట్టర్ భవిష్యత్తుపై నీలినీడలు

ట్విట్టర్ భవిష్యత్తుపై నీలినీడలు

ముంబై, నవంబర్ 5, 
సోషల్ మీడియా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ బ్లూటిక్ మార్క్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనంతటికీ కారణం.. యూఎస్ టెక్ బిలియనీర్.. ట్విటర్ కొత్త యజమాని ఎలన్ మస్క్.. సాధారణంగా ఎలన్ మస్క్ నిర్ణయాలు చర్చల్లో నిలుస్తుంటాయి. అయితే.. ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేయడమే.. ఆలస్యం కీలక సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. అంతకుముందు ఓ లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క అన్నట్లు.. తన మార్కును చూపించడం మొదలు పెట్టారు. మైక్రోబ్లాగింగ్ సైట్‌ సిబ్బంది నుంచి కంటెంట్‌ వరకు ఎన్నో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు ట్విట్టర్‌ బ్లూ బ్యాడ్జ్‌ విషయంలో కూడా ఎలన్ మస్క్‌.. దిమ్మతిరిగే నిర్ణయం తీసుకున్నారు. బ్లూ టిక్‌ను ఉంచడానికి వినియోగదారులు నెలకు US $ 8 చెల్లించవలసి ఉంటుందని ప్రకటించారు. గత వారం ట్విట్టర్‌ కంపెనీని టేకోవర్ చేసుకున్న మస్క్, ‘వెరిఫైడ్’ యూజర్లు నెలకు US $20 చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత కొత్త విధానం అమల్లోకి తీసుకువచ్చారు. అయితే, ధర కొనుగోలు శక్తి సమానత్వానికి అనుగుణంగా సర్దుబాటు చేసినట్లు మస్క్ చెప్పారు.మస్క్.. కొత్త విధానం ప్రకారం.. బ్లూ బ్యాడ్జ్‌ ధృవీకరించబడిన వినియోగదారులు ” రిప్లే, ప్రస్తావనలు, శోధనలలో ప్రత్యేక ప్రాధాన్యత పొందుతారు. ఇంకా స్పామ్, స్కామ్‌ లాంటి వాటి నుంచి కూడా రక్షణ లభిస్తుంది.. వాటిని నిరోధించడానికి సహకారం అందిస్తుంది.” కొత్త వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో ఎక్కువ జీబీ ఉన్న వీడియోలు, ఆడియో క్లిప్‌లను కూడా పోస్ట్ చేయవచ్చు. వెరిఫైడ్‌ వినియోగదారులు సగం కంటే ఎక్కువ ప్రకటనలకు బహిర్గతమవుతారు. ఇంకా కంపెనీతో పని చేయడానికి ఇష్టపడే ప్రచురణకర్తల కోసం పేవాల్ బైపాస్ కూడా ఉంటుంది.“ఇది కంటెంట్ సృష్టికర్తలకు (యూజర్లు) రివార్డ్ చేయడానికి ట్విట్టర్‌కు ఆదాయ స్ట్రీమ్‌ను కూడా ఇస్తుంది. పబ్లిక్ ఫిగర్ అయిన వారి పేరు క్రింద సెకండరీ ట్యాగ్ ఉంటుంది. ఇది ఇప్పటికే రాజకీయ నాయకులకు సంబంధించినది” అని మస్క్ వరుస ట్వీట్‌లలో ప్రకటించారు.2021లో వరుసగా రెండో ఏడాది లాభాలను ఆర్జించడంలో విఫలమైన కంపెనీ, ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలను కనుగొనడంలో ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ పాలసీ ప్రకటన వచ్చింది. అయితే Twitter దాని నష్టాలను 2021 నుంచి గతేడాది వార్షక ఆదాయం వరకు 80% తగ్గించింది.శాన్ ఫ్రాన్సిస్కో-ఆధారిత కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో రెండవ త్రైమాసికంలో $1.2 బిలియన్ల ఆదాయాన్ని, $270 మిలియన్ల ఆదాయ నష్టాన్ని నివేదించింది. ఇది ఆర్థిక విశ్లేషకులు చేసిన సగటు అంచనాల కంటే తక్కువగా ఉంది.కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, US బిలియనీర్ మధ్య నెలల తరబడి జరిగిన చట్టపరమైన గొడవల తర్వాత.. గత వారం ఖరారు చేసిన ధరకు కంపెనీని మస్క్ స్వాధీనం చేసుకోవడంతో చాలా మంది నిపుణులు కంపెనీ ఆదాయ నష్టాన్ని ముడిపెట్టారు.ఆర్థిక నష్టాలతో పాటు, కంపెనీ అంతర్గత పత్రాల ప్రకారం.. ట్విట్టర్ తన అత్యంత క్రియాశీల వినియోగదారులను కోల్పోతున్నట్లు గత నెలలో ఒక నివేదిక పేర్కొంది. 10 శాతం మంది వినియోగదారులను కలిగి ఉన్నప్పటికీ 90 శాతం కంటెంట్‌పై ఆధారపడిన “భారీ ట్వీటర్‌లను” నిమగ్నమై ఉంచడానికి కంపెనీ కష్టపడుతుందని పత్రాలు చూపించాయి.కొత్త నిబంధనలు ట్విట్టర్‌ను తప్పుడు సమాచార వేదికగా మారుస్తాయనే భయాలు ఉన్నాయి. Twitter డబ్బుకు బదులుగా కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తుంది. కావున రాజకీయ పార్టీలు, పెద్ద సంస్థల వంటి ఆర్థిక బలం ఉన్నవారు ప్లాట్‌ఫారమ్ విశ్వసనీయతకు కోలుకోలేని విధంగాచ, నష్టాన్ని కలిగించే కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించవచ్చు.బ్లూ బ్యాడ్జ్‌తో పెయిడ్ యూజర్‌లు పోస్ట్ చేసిన పోస్ట్‌లకు ప్రాధాన్యతనిస్తుందన్న మస్క్.. చివరికి బ్లూ బ్యాడ్జ్‌కి చెల్లించడానికి ఇష్టపడని వారిపై ఎలాంటి విషయాలను జోడించనున్నారు.. అనే వాటిని మాత్రం మస్క్ ఇంకా స్పష్టం చేయలేదు.బ్లూ టిక్ అనేది ట్విట్టర్ వినియోగదారు ప్రాముఖ్యతను తెలుపుతుంది. మస్క్ ‘డిజిటల్ టౌన్ స్క్వేర్’గా పేర్కొన్న దానికి అతని లేదా ఆమె ప్రాముఖ్యతను నిర్వచించే ఒక గుర్తింపు మాత్రమే. కానీ ట్విట్టర్ ముఖ్యమైన, విలువైన ఫీచర్ చివరికి మొత్తం ప్లాట్‌ఫారమ్‌ను తగ్గించే సాధనంగా మారుతుందని చాలా మంది భయపడుతున్నారు.ట్విట్టర్ యజమాని మస్క్ నిర్ణయాలతో.. ఇండియా యూజర్లు స్వదేశీ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ వైపు మళ్లుతున్నారు. 50 మిలియన్లకు పైగా మంది కూ యాప్ ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు కంపెనీ ప్రకటింంచింది. గతేడాదితో పోలిస్తే.. వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కంపెనీ పేర్కొంది. బహుభాషా కూ యాప్ 2020లో కన్నడ భాషకు మద్దతుతో ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ఉద్భవించింది. హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, అస్సామీ, మరాఠీ, బంగ్లా, గుజరాతీ భాషల్లోకి విస్తరించింది. ఈ యాప్ ప్రస్తుతం 10 భాషల్లో అందుబాటులో ఉంది.కూ యూజర్ల సంఖ్య పెరగడంపై కూ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ స్పందించారు. 50 మిలియన్ల డౌన్‌లోడ్ మార్కును దాటినందుకు చాలా సంతోషిస్తున్నామమని తెలిపారు. తమ వేగవంతమైన వృద్ధి, భారతీయులు తాము అందిస్తున్న సేవలకు ఇది నిదర్శనం అని కూ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు

Related Posts