YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి

భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి

మంథని
జాతి ఐక్యత కోసం రాహుల్ గాంధీ యాత్ర కొనసాగిస్తున్నారని, ఆయన అడుగులో అడుగేసేందుకు ఈ నెల 6, 7తేదీలలో జరిగే పాదయాత్రలో మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.     మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో  భారత్ జోడో యాత్ర సన్నాహక సమావేషాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర 6,7 తేదీలలో మెదక్, కామారెడ్డి జిల్లాలకు చేరుకుంటుందని పలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పక పాదయాత్రలలో పాల్గొవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts