YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీఆర్ఎస్ లో చేరనున్న మోత్కుపల్లి? ఆలేరు టికెట్ ఆశిస్తున్న నర్సింహులు

టీఆర్ఎస్ లో చేరనున్న మోత్కుపల్లి?     ఆలేరు టికెట్ ఆశిస్తున్న నర్సింహులు

టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది.. ఈ నెలాఖరులో తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం కాబోతున్నారు. వచ్చే నెలలో కారు ఎక్కేందుకు సన్నాహకాలన్నీ పూర్తయినట్టు తెలుస్తోంది 2019 ఎన్నికల్లో ఆలేరు నియోజకర్గం నుంచి టీఆర్ఎస్ తరపున మోత్కుపల్లి పోటీ చేయనున్నారని చెబుతున్నారు. అయితే తుంగతుర్తి అసెంబ్లీ లేదా వరంగల్ లోక్ సభ నుంచి ఏదో ఒక చోట పోటీ చేయాలని టీఆర్ఎస్ కోరుతున్నట్టు సమాచారం. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మోత్కుపల్లిని పలుమార్లు కలిసి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ బలహీన పడిందని, పార్టీని టీఆర్ఎస్ లో కలపడమే మంచిదని గతంలో మోత్కుపల్లి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Related Posts