హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారులేసిన తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. భాగ్యరెడ్డివర్మ 130వ జయంతిని పురస్కరించు కొని ఆయన సేవలను స్మరించుకున్నారు. దళిత జనోద్దరణ కోసం ఉద్యమాలు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసారని పేర్కొన్నారు. .జోగిని, దేవదాసి వంటి దురాచారాలను రూపుమాపేందుకు ఉద్యమించారని.. పేద, బడుగు, లహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడ్డారని సీఎం గుర్తు చేసుకున్నారు.ఉద్యమకారుడిగా,హక్కులకార్యకర్తగా,రచయితగా, పాత్రికేయుడిగా, సంఘసంస్కర్తగా బహుముఖ ప్రజ్ఞను చాటిన భాగ్యరెడ్డి వర్మ నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.