YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కృష్ణా నది పునర్జీవనం చేయడం శుభపరిణామం నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు

కృష్ణా నది పునర్జీవనం చేయడం శుభపరిణామం           నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు

దేశంలో నాలుగో అతిపెద్ద నది కృష్ణనది అని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఇండియా వాటర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కృష్ణానది పునర్జీవనం అనే అంశంపై జాతీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణా భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కృష్ణా నది పునర్జీవనం చేయడం శుభపరిణామం. నదుల పునరుజ్జీవానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టిందని తెలిపారు. కృష్ణా బేసిన్‌లో ఆరు వేల చెరువులను పునరుద్ధరించామని మంత్రి చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టులో365 రోజుల పాటు నీళ్లు ఉంటాయి. దేశంలోనే నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధిక నిధులు విడుదల చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని హరీష్ రావు చెప్పారు.మహారాష్ట్రలో విద్యుత్ ఉత్పత్తి చేసిన నీటిని ఆరేబియా సముద్రంలోకి వదులుతున్నది. ఆ నీటిని కృష్ణానీటిలోకి వదిలితే మన రాష్ట్రంలో ఐదు చోట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. నదులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. సీఎం కేసీఆర్‌కు నీటి విలువ తెలుసు కాబట్టే పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. వృథాగా సముద్రంలోకి వెళ్లే నీటిని ఉపయోగించుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని హరీష్ రావు పేర్కొన్నారు.తెలంగాణ ఏర్పడిన సమయంలో చెరువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరణ చేస్తున్నామని, దీంతో గ్రౌండ్ వాటర్ పెరిగిందన్నారు. మిషన్ కాకతీయ వల్ల తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని అలాగే చేపల ఉత్పత్తి 62శాతం పెరిగిందని అన్నారు. కృష్ణా నీటివినియోగంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించామని మంత్రి వెల్లడించారు. వందేళ్లుగా నిరీక్షిస్తోన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నామని తెలిపారు. కోయిన డ్యామ్ నుంచి ప్రతీ ఏటా కర్ణాటక 100టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తోందని, అనంతరం ఆ నీరు పూర్తిగా అరేబియా సముద్రంలో వృధాగా కలుస్తోందన్నారు. అది వృధా కాకుండా చూస్తే అంతకంటే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని సూచించారు. నదులను కాపాడుకోకపోతే భాష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. హరితహారంతో చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టినం. మానేరు, మూసీనదుల పునర్జీవనం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. కృష్ణా బేసిన్‌లో వర్షపాతం తక్కువగా ఉండటం.. కృష్ణా నీటిని వాడుకోలేకపోవడంతో అక్కడి ప్రజలు గతంలో వలస వెళ్లారు. కృష్ణా నది నుంచి 6 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాం. వలస వెళ్లిన వారు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో మంప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్, జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts