YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ ఎంపీల రాజీనామాపై నిర్ణయం

 వైసీపీ ఎంపీల రాజీనామాపై నిర్ణయం

వైసీపీ ఎంపీల రాజీనామాలపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 29న లోక్‌సభ స్పీకర్‌తో వైసీపీ ఎంపీలు భేటీ కాబోతున్నారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వైసీపీ ఎంపీలు స్పీకర్‌ను కోరారు. దాంతో సుమిత్రా మహాజన్‌ను వ్యక్తిగతంగా కలవాలని వైసీపీ ఎంపీలకు స్పీకర్ ఆఫీసు నుంచి లేఖ వచ్చింది. ఈనెల 29 సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య భేటీ జరిగే అవకాశం ఉంది.  వైసీపీ ఎంపీ రాజీనామాల ఆమోదంపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.తమ పదవులకు రాజీనామాలు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఐదుగురికి లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. ఈ నెల 29వ తేదీన తనను వచ్చి కలవాల్సిందిగా కోరుతూ స్పీకర్ ఆ లేఖలో పేర్కొన్నారు. వీరు సమర్పించిన రాజీనామా పత్రాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికే స్పీకర్ వీరిని పిలిచారు. ఆ రోజున వీరితో స్పీకర్ వ్యక్తిగతంగా మాట్లాడతారని.. విడివిడిగా వీరితో సమావేశమై స్పీకర్ వీరి రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేశారు.  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజున వీరు స్పీకర్‌కు రాజీనామా పత్రాలను ఇచ్చారు. ప్రత్యేకహోదా డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. అయితే ఆ తీర్మానం చర్చకు రాకుండానే సభ నిరవధిక వాయిదా పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీల కూటమి ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని నిలబెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఏపీకి హోదా సాధ్యం కాదని కేంద్రం అంటున్న నేపథ్యంలో అందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలు ఆమోదం పొందే అవకాశాలున్నాయని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29వ తేదీన స్పీకర్ వీరితో వ్యక్తిగతంగా మాట్లాడతారని, ఆ రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు వరకూ వీరికి అపాయింట్‌మెంట్ ఇస్తూ పిలుపు వచ్చింది. మూకుమ్మడి రాజీనామాల నేపథ్యంలో వారితో మాట్లాడి స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. స్పీకర్ రాజీనామాలు ఆమోదిస్తే.. వెంటనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది.

Related Posts