YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బండారు దత్తాత్రేయ కుమారుడు హఠాన్మరణం..!!

బండారు దత్తాత్రేయ కుమారుడు హఠాన్మరణం..!!

మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో మరణించాడు. మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు.   దత్తన్నకు 49 ఏట పుట్టిన వైష్ణవ్.అల్లారు ముద్దుగా పెంచుకున్న దత్తన్న. లేకలేకపుట్టిన బిడ్డ 21 ఏళ్లకే దూరమైన వేళ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. దత్తన్న ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని ఆయన ఇంటివద్ద ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నటుడు నందమూరి హరికృష్ణ తదితరులు పరామర్శించారు.

Related Posts