ఉత్తర తెలంగాణ లో భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో భారీవర్షంతోపాటు ఈదురు గాలులు. ఉరుములు. మెరుపులు రావడంతో జనజీవనం స్థంభించింది. ఉమ్మడి కరీంనగర జిల్లా లోని గంగాధర ధర్మపురి ,జగిత్యాల ,కోడీమ్యాల ,వేములవాడ లో ఉరుములు మెరుపులు గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. మేఘాలు భారీగా కమ్ముకున్నాచి. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా కి అంతరాయం కలిగింది. అంతేకాకుండా రైతులకు చేతికి వచ్చిన పంట భారీ వర్షాల వల్ల ముద్దయ్యాయి. ప్రజలు బయటకు రాకుండా వుండిపోయారు.