YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టాప్ 2 లో టీడీపీ

టాప్ 2 లో టీడీపీ

దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న ప్రాంతీయ పార్టీల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది తెలుగుదేశం పార్టీ. తొలి స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ నిలిచిన ఈ జాబితాలో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయ వ్యయాల వివరాల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను విశ్లేసిస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటికి రిఫార్మ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. దేశంలోని 32 ప్రాంతీయ పార్టీల 2016-17 సంవత్సరపు ఆదాయం 321.03 కోట్లు గాకా అందులో మెజారిటీ వాటా సమాజ్‌వాదీ పార్టీదే. ఆ పార్టీ ఏకంగా 82.76 కోట్ల రూపాయల ఆదాయంతో నంబర్ వన్ గా నిలిచింది. ఇక తెలుగుదేశం పార్టీ 72.92 కోట్ల రూపాయల ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఉంది అన్నాడీఎంకే. ఈ పార్టీ ఆదాయం 48.88 కోట్ల రూపాయలు. ఇక వ్యయం విషయానికి వస్తే.. అత్యధిక వ్యయం చేసిన పార్టీల జాబితాలో కూడా ఎస్పీ నంబర్ వన్ పొజిషన్లో ఉంది. డీఎంకే, అన్నాడీఎంకేలు వ్యయం విషయంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. ఈ పార్టీలు తమకు లభించిన ఆదాయం కన్నా అధిక మొత్తాన్ని వ్యయం చేశాయని ఏడీఆర్ పేర్కొనడం. 

Related Posts