YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇఫ్తార్ విందులతో మత సామరస్యత మంత్రి పద్మారావు గౌడ్ వెల్లడి

ఇఫ్తార్ విందులతో మత సామరస్యత మంత్రి పద్మారావు గౌడ్ వెల్లడి

మైనారిటి ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తీ.పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగూడ కు చెందిన తెరాస మైనారిటీ సీనియర్ నాయకుడు ఘౌసే భాయి మంగళవారం రాత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని తెలిపారు.   రాష్ట్ర ప్రభుత్వం మైనరిటిల సంక్షేమానికి అమలు జరుపుతున్న వివిధ కార్యక్రమాలతో పటు సికింద్రాబాద్ పరిధిలో వివిధ విభిన్న కార్యక్రమాలు చేపదుతున్నామని తెలిపారు. చిలకలగూడ ఇద్గా ను తెలంగాణా రాష్ట్రం లోనే మోడల్ ఇద్గా గ తీర్చి దిద్దుతున్నామని తెలిపారు. గతంలో తమ హయంలోనే ఇద్గా లో  ఫ్లోరింగ్ ఏర్పాటు చేసామని, కొత్తగా విద్యుత్ లైట్ల ఏర్పాటు, ప్రహరి ఇతరత్రా సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి పద్మారావు తెలిపారు. మైనారిటే లు ఎల్ల కాలం గుర్తుంచు కోనెల వివిధ ఏర్పాట్లు జరుపుతున్నామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.

Related Posts