YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు రూ. 34000 స్వాధీనం

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు రూ. 34000 స్వాధీనం

కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు లను పోలీసులు అరెస్టు చేసారు.  బుధవారం విలేకరుల సమావేశంలో మంత్రాలయం సీఐ  రాము, ఎస్సై శ్రీనివాస్ నాయక్  మాట్లాడుతూ మంగళవారం రాత్రి జరిగిన హైదరాబాద్ - చెన్నై జట్టు మధ్య జరిగిన క్రికెట్ ఆటలో బెట్టింగ్ ఆడుతున్న మంత్రాలయం కు చెందిన శ్రీనివాసులు, రాజేంద్ర,  వెంకటేష్,  లక్ష్మన్న, ఎమ్మిగనూరు కు చెందిన వడ్డే రఘు లను సంత మార్కెట్ దగ్గర దాడి చేసి పట్టుకున్నారు. నిందితులనుంచి రూ 34000 నగదు. రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని పత్తి కొండ కోర్టులో హాజరు పరిచారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ ఆడినా,  నిర్వహించినా ఎంతటివారినైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Posts