YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గొప్ప స్ఫూర్తి ప్రదాత,ఆదర్శమూర్తి రమాబాయి అంబెడ్కర్

గొప్ప స్ఫూర్తి ప్రదాత,ఆదర్శమూర్తి రమాబాయి అంబెడ్కర్

గొప్ప స్ఫూర్తి ప్రదాత,ఆదర్శమూర్తి రమాబాయి అంబెడ్కర్                          
-నేడు ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళులు
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ సతీమణి రమాబాయి అంబెడ్కర్. ఈమె ఫిబ్రవరి 7న,1898 లో జన్మించింది. మాత రమాబాయి ప్రపంచ మేధావిని తీర్చిదిద్ది దేశానికే దీపమయ్యారు. రమాభాయి బాబా సాహెబ్ ను గుర్తించినంతగా తన స్వంత జాతి ప్రజలు బాబా సాహెబ్ విజయాలకు కారణమైన రామబాయిని గుర్తించలేదనే చెప్పాలి. తన త్యాగాల పునాదుల మీద బాబా సాహెబ్ ని ఒక మేను పర్వతంగా తాను నిలబెట్టింది. డాక్టర్ అంబేద్కర్ గారి ఒకొక్క మెట్టు వెనుక రమాబాయి అమ్మ పంటి బిగువున బిగపట్టిన బాధ తాలూకు గాయలున్నాయి. బాబా సాహెబ్ ఇదంతా గుర్తించారు. ఆమెకు గుర్తుగా 1941 ఆయన వ్రాసిన 'థాట్స్ ఆన్ పాకిస్తాన్' పుస్తకాన్ని అంకితమిచ్చారు. అతి తొందరగా "నా "అనుకునే వారిని పోగొట్టుకున్న రమాబాయితో బాబా సాహెబ్ వివాహం 1906 లో బైకుల్లా మార్కెట్ లో జరిగింది అప్పుడు బాబా సాహెబ్ కి పద్నాలుగు ఏళ్ళు, రమాబాయికి తొమ్మిది ఏళ్ళు. అతి చిన్నవయసులోనే వివాహం జరగడం వలన రమాబాయి చదువుకు దూరం అయ్యింది. బాబా సాహేబ్ తనకు చదువు చెప్పేంచాలని ప్రయత్నం చేయడం జరిగింది, ఈ ప్రయత్నంలో ఆమె కొద్దిగా వార్త పత్రికల హెడ్ లైన్ లు చదవవలగడం నేర్చుకుంది. తన పెళ్లి తరువాత బాబా సాహెబ్ మెట్రిక్యులేషన్ పాస్ అయ్యారు. డాక్టర్ అంబెడ్కర్ గారికి ఎల్లవేళలా తోడుంటూ ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ జీవనం సాగించడం జరిగింది. ఉన్నత చదువులకు బరోడా రాజు ప్రోద్బలం తో బాబా సాహెబ్ లండన్ వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఇంటి బాధ్యతలు రమాబాయి ఒక్కరే నెరవేర్చుకున్నారు. బాబా సాహెబ్ ఉన్నత  చదువులకోసం తాను ఎన్నో బాధలను అనుభవించింది. ఇల్లు గడవని స్థితిలో రమాబాయి పిడకలు చేసి అమ్మేవారు ఆ డబ్బులతో ఇల్లు గడిచేలా చూడటమే కాకుండా అందులో కొంత డబ్బు డాక్టర్ అంబెడ్కర్ కి పంపించేవారు. ఆమె జీవిత కాల కష్టమే ఈ రోజున రాజ్యాంగం ద్వారా హక్కులు అణగారిన వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారని అనడంలో సందేహం లేదు. ఈ విషయాలు స్వయంగా డాక్టర్ అంబెడ్కర్ గారు 3 ఫిబ్రవరి 1928 న బహిష్కృత భారత్ పక్ష పత్రికలో తన సంపాదకీయంలో రాశారు. ఒకొక్కరుగా తన బిడ్డలు రాలి పోతున్నా మొక్కవోని ధైర్యం రమాబాయి సొంతం, ఎంతటి బాధనైన తన గుండెల్లోనే దాచుకుని బాబా సాహెబ్ కి ధైర్యాన్నీ నూరిపోసేవారు. 1907 నుండి మొదలయిన బాబా సాహెబ్  చదువు ప్రస్థానం 1953 ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో ముగిసింది. ఇవి సాధించటానికి వాళ్ళు ఇద్దరూ కారణమే, ఈ ప్రతీ చదువు వెనుక రమాబాయి త్యాగం ఉంది. బాబా సాహెబ్ లండన్ కి వెళ్తున్నపుడు రమాబాయి గర్భవతిగా ఉంది. రమాబాయి అమ్మ యొక్క కుమారుడు  'రమేష్' చనిపోయారు, 'గంగాదర్' చనిపోయారు, ఒక్కగానొక్క ఆడ కూతురు 'ఇందు' చనిపోయారు, చివరివారు బాబా సాహెబ్ కి అత్యంత ఇష్టుడు చిన్నవాడు అయినా 'రాజ్ రతన్' కూడా చనిపోయాడు, యశ్వంత్ అంబేడ్కర్ ఒక్కరే మిగిలాడు. బాబా సాహెబ్ జీవితం అంటే పోరాటం ఆ పోరాటంలో తనతో పాటు రమాబాయి అమ్మకూడా తన వంతు పనిచేసింది. రమాబాయికి చదువు విషయంలో బాబా సాహెబ్ ని చూసి గర్వపడేది. అసమాన ఆయన ప్రతిభను చూసి నివ్వెర పోయేది. సమానత్వం కోసం ఆయన పడుతున్న తపనకు చలించిపోయేది. ఇదంతా చేస్తూ ఆయన ఆరోగ్యo కాపాడుకోలేక పోతున్నారు అంటూ అనుక్షణం తపన పడేది. రమాబాయి అమ్మ అంటే త్యాగo, రమాబాయి అమ్మ అంటే ఒక పోరాటం, చివరకు 1935 మే 27న ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణించిన తర్వాత అంబేద్కర్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు సన్యాసం తీసుకోవాలని భావించారు. ఎంతోమంది మిత్రులు నచ్చచెప్పి అంబేద్కర్‌ని మామూలు మనిషిగా మార్చారు. ఈవిధంగా కటికదారిద్య్రంలో జీవితం కొనసాగించిన రమాబాయి ఏ రకమైన ప్రలోభాలనూ తన దరిదాపుల్లోకి రానివ్వలేదు. తన భర్త బారిష్టరైనా ఆమె పిడకలు వేసి సంసారాన్ని నడిపించారు. ఆమె ఇవన్నీ చూస్తూ కేవలం తన బాధ్యతలను నెరవేరుస్తున్నానని అనుకున్నాను. కాని తనకు తెలియకుండానే ఆత్మగౌరవంతో, మానసిక నిబ్బరంతో జీవించారు. ప్రపంచమేథావి అయిన అంబేద్కర్‌ జీవన గమనంలో రహదారిగా మారారు. ఇలాంటి ధన్యజీవి రమాబాయి అంబేద్కర్ జీవితం అందరికీ ‌ఆదర్శం.

Related Posts