నిధుల సమీకరణ కోసం చంద్రబాబు ఆలయాలను సైతం దోచుకుంటున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి వ్యాఖ్యానివ్వడం సంచలనంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్లలోని ఆయన నివాసాలకు తరలించారని విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 12 గంటల కంటే ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇస్తే తిరుమల ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని అన్నారు. కేవలం హెరిటేజ్ వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులు కూడబెట్టారంటే సాధ్యమైన పని కాదని ఆయన చెప్పారు. వెంటనే దీనిపై విచారణ జరిగి వెంటనే బంగారు ఆభరణాలను టిటిడికి అప్పచెప్సాలని అన్నారు.