YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జూనియర్ చుట్టూ ఏపీ రాజకీయం

జూనియర్  చుట్టూ ఏపీ రాజకీయం

విజయవాడ, ఫిబ్రవరి 28, 
జూనియర్ ఎన్టీఆర్... ప్రస్తుతం ఈ పేరు చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తోంది…! అందులో టీడీపీని మాత్రం ఓ రేంజ్ లోనే వెంటాడుతూనే ఉంది! ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏ కార్యక్రమంలో పాల్గొన్న... జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు మార్మోగుతూన్న సంగతి తెలిసిందే. రామయ్య వస్తావయ్యా అనే ఫ్లెక్సీలు కూడా దర్శనమిస్తున్నాయి. కొన్నిసార్లు అయితే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు కూడా దద్దరిల్లుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత... టీడీపీలో ఈ పరిస్థితి మరీ ఎక్కువైపోయింది. టీడీపీని నెక్స్ట్ లీడ్ చేసేది జూనియర్ ఎన్టీఆరే... తర్వాత అంతా ఆయనే అన్న చర్చ ఎప్పట్నుంచో ఉంది…! అయితే ఇదీకాస్త... ఈ మధ్య ఎక్కవైపోయింది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన కొన్ని కామెంట్స్ తో .. విషయం కాస్త పీక్స్ కు చేరింది. కట్ చేస్తే... టీడీపీ నేతల రియాక్షన్స్ పెద్దగా లేనప్పటికీ... అధికారపక్షం(వైసీపీ) నుంచి మాత్రం గట్టి రీసౌండ్ వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ గురించి లోకేశ్ మాట్లడటమేంటంటూ ఎదురుదాడి చేస్తున్న సీన్లు కనిపిస్తున్నాయి. ఇది పక్కనపెడితే... అసలు జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఇప్పుడు టీడీపీకి ఉందా..? ఆయన రావాల్సిందేనా..? లోకేశ్ కామెంట్స్ పై ఇంత చర్చ ఎందుకు నడుస్తోంది..? ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీని కేవలం రాజకీయంగా మాత్రమే వాడుకోవాలని టీడీపీ చూస్తుందా..? లేక మనస్ఫూర్తిగానే ఆహ్వానిస్తుందా..? అనేది పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్ గా మారింది.పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు...నైతిక విలువలను గాలికి వదిలేయటం ఓ అవకాశవాదం. కానీ అది రాజకీయ నాయకుడి పరిణితిపై ఆధారపడి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే... 'మా బావ మనోభావాలు దెబ్బతినాయ్' అంటూ వీరసింహారెడ్డిలో బాలకృష్ణ ఓ డైలాగ్ చెప్తాడు. అచ్చం అలాగే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్న అడగటంతో... లోకేశ్ కూడా అదే పరిస్థితిని ఫేస్ చేశాడేమో అనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు... నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే... నారా నాయకత్వం పెద్దగా ఆమోదం తెలపకపోవచ్చనే చర్చ ఎప్పట్నుంచో ఉంది…! ఇక అసలు మ్యాటర్ కి వస్తే..... రాష్ట్రవ్యాప్తంగా ‘యువగళం’ పేరుతో లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తిరుపతి వేదికగా 'హలో లోకేశ్' అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు లోకేశ్ రియాక్ట్ అయ్యారు.జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే వంద శాతం ఆహ్వానిస్తామంటూ లోకేశ్ ఆన్సర్ ఇచ్చారు. ఇదే సమయంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఏపీ రాజకీయాల్లో సానుకూలమైన మార్పు తీసుకురావాలన్న తపన ఉన్నవారు...ఎవరు వచ్చినా తాను స్వాగతిస్తానంటూ మాట్లాడారు. ఇక్కడ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు లోకేశ్. అయితే టీడీపీ స్థాపకుడు, సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా పేరొందిన జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ స్వాగతించటం తెలివైన జవాబే కావొచ్చు... కానీ మరోవైపు అదే జూనియర్ ఎన్టీఆర్... లోకేశ్ రాజకీయ భవిష్యత్తుకు అవరోధంగా మారుతారన్న భావన కూడా ప్రస్తుత టీడీపీ నాయకత్వంలో ఉందనే వాదన తెరపైకి వస్తోంది. ఇక వారసత్వ పోరులో ఉద్దేశపూర్వకంగానే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు... సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు పక్కన పెట్టారనే వాదన కేడర్ లో ఎప్పట్నుంచో ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లోకేశ్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయనే చర్చ నడుస్తోంది.భవిష్యత్ లో టీడీపీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చ జరిగితే లోకేశ్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ రేసులోకి రావొచ్చన్న చర్చ ఉంది. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. పార్టీ విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైంది. ఈ పరిణామాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫెయిల్యూర్ గా చూపిస్తే…. లోకేశ్ కు లైన్ క్లియర్ అయ్యే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన(2014) తర్వాత... రాజకీయముఖ చిత్రం మారిపోయింది. ఏపీ, తెలంగాణ వేర్వురు కాగా.. నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఓవైపు ప్రభుత్వాన్ని నడుపుతూనే... మరోవైపు తన రాజకీయలక్ష్యాన్ని కూడా నెరవేర్చే ప్రయత్నాలు చేశారు. పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ ను పక్కనపెట్టేశారు చంద్రబాబు. ఆయన కుమారుడైన నారా లోకేశ్ ను కేంద్రబిందువుగా మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక గతం చూస్తే 1995లో కూడా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను పార్టీలైన్ నుంచి తప్పించేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం జూనియర్ ఎన్టీఆర్ మనసులో బలంగా నాటుకుపోయిందన్న చర్చ కూడా ఉంది.ఇక లోకేశ్... ఎన్టీఆర్ ను స్వాగతించటం వెనక మరో కోణం ఉందన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన పొత్తు ఉంటుందన్న వాతావరణం నెలకొంది. అయితే ఈ మైత్రికి జనసేనలోని ఓ వర్గం ఆమోదం తెలపడం లేదంట…! సొంతంగానే పోటీ చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కు సూచిస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తుంది. ఇదీ కాస్త ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేశ్... జూనియర్ ఎన్టీఆర్ ను స్వాగతిస్తూ మాట్లాడారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక లోకేశ్ పాదయాత్ర వెనక కూడా పెద్ద మంత్రాంగమే నడిచిందని తెలుస్తోంది. తనని తాను నిరూపించుకునేందుకే పాదయాత్ర పేరుతో లోకేశ్ ను టీడీపీ నాయకత్వం ప్రజల్లోకి పంపించిందన్న చర్చ జోరుగా ఉంది. దీనికి కారణం కూడా జూనియర్ ఎన్టీఆర్ అన్న వాదన బలంగా ఉంది. ఎందుకంటే... పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించాలన్న స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా లోకేశ్ ను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారన్న కోణంలో వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు వయసు కూడా 73 ఏళ్లకు చేరుతుంది. ఆరోజు నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేం. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన చంద్రబాబు... లోకేశ్ ను లీడర్ గా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నట్లు అర్థమవుతోంది. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తే... ఆదరణ దక్కే అవకాశం ఉంటుంది ఆయన అంచనా..! ఇదే కనుక చేయకపోతే పార్టీ నాయకత్వ బాధ్యతలు చూసే విషయంలో లోకేశ్ వెనకబడే అవకాశం ఉంది. అందుకే యువగళం యాత్రతో ప్రజల్లోకి వెళ్లేలా స్కెచ్ వేశారు చంద్రబాబు.

Related Posts