పెద్దపల్లి
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అరోపణలు చేయడం సిగ్గుచేటని బిఅర్ఎస్ కౌన్సిలర్లు ద్వజమెత్తారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఇంటింటికి అబద్దాలు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెటును మరోచోటికి తరలించి, మార్కెట్ స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించడం ఆయన సిగ్గుమాలిన రాజకీయానికి నిదర్శనమన్నారు. రూ.5కోట్లతో ఆధునిక మార్కెట్ నిర్మించడానికి ప్రణాళికలు సిద్దమయ్యాయని, అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రూ.2కోట్ల నిధులను వెచ్చించి వ్యవసాయ మార్కెట్ వద్ద వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంఖుస్థాపన సైతం పూర్తయ్యిందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన పనులను చెప్పుకోవాల్సిన విజయరమణారావు, అది మరిచిపోయి ప్రస్తుత ఎమ్మెల్యే దాసరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్ర్మగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు ఉప్పు రాజు, ఇల్లందుల క్రిష్ణమూర్తి, లైశెట్టి బిక్షపతి, పూదరి చంద్రశేఖర్, పెంచాల శ్రీధర్, పాగాల శ్రీకాంత్ సోని, జావిద్, సాబీర్ ఖాన్, ఖదీర్ ఖాన్, బొంకూరి మధు, తదితరులు పాల్గొన్నారు.