YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు --వైఎస్‌ జగన్‌

భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు --వైఎస్‌ జగన్‌

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జగన్

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం సగుటూరు వైసీపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం స్కూల్ పిల్లలతో వైఎస్ జగన్ ముచ్చటించారు. భారతీయులకు వైఎస్‌ జగన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే వైసీపీ కేంద్ర కార్యాలయం, జిల్లా, మండలస్థాయి కార్యాలయాల్లో స్థానిక నేతలు గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

Related Posts