YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

25 నుంచి ఎంసెట్-2018 కౌన్సెలింగ్

25 నుంచి ఎంసెట్-2018 కౌన్సెలింగ్

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 25 నుంచి ఎంసెట్-2018 కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎంసెట్ అడ్మిషన్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కౌన్సెలింగ్ నిర్వహణ కోసం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి ఈ నెల 25నుంచి జూన్2 వరకు గడువు విధించారు. ఈ నెల 28 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 2018-19విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.

Related Posts