హైదరాబాద్
ఎమ్మెల్సీ కవిత వీడి విచారణకు హాజరవుతున్న రోజు నగరంలో పలుచోట్లల ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. బిజెపిలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫోటోలతో పోస్టర్లు వెలిసాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సిబిఐ, ఈడీ రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీలలో పేర్కోన్నారు. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హెమంత బిశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బిజెపి ముఖ్య నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో పోస్టర్లు వెలిసాయి. కానీ ఎమ్మెల్సీ కవిత రెయిడ్స్ కి ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు కనిపించాయి. నిజమైన రంగులు వెలసిపోవు అంటూ కొటేషన్తో వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. చివర్లో బై బై మోడీ అంటూ హాష్ టాగ్ జోడించారు.