YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్సీలను సన్మానించిన నారా లోకేష్

ఎమ్మెల్సీలను సన్మానించిన నారా లోకేష్

కదిరి
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని  పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన రాం గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ. చిరంజీవి. మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసారు. వారికి లోకేష్ శాలువా కప్పి సన్మానించారు.లోకేష్ మాట్లాడుతూ వైసిపి అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోలు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గకుండా సైకో పాలన పై మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. ప్రజా సమస్యల పై మండలి లో గళం వినిపించాలని అన్నారు. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ  మాపై ముందు నమ్మకం పెట్టుకొని సీటు ఇచ్చిన మీకే మా గెలుపును అంకితం చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మీ డైరక్షన్ లో పనిచేస్తామని అన్నారు.

Related Posts