ములుగు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మేడారం కొండాయి గ్రామానికి చెందిన గోవిందరాజుల పూజారి దబగట్ల రవి(45) ని బండరాళ్ల తో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు హత్య పై తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఘటన జరిగి రెండు రోజులయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు రోజులు ముందు మృతుడు ఎవరితో ఉన్నాడు అనే విషయమై వివరాలు సేకరిస్తున్నారు.