న్యూఢిల్లీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం నాడు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ కార్యాలయానికి బయల్దేరే ముందు కవిత పాత ఫోన్లను అందరికి చూపిస్తూ బయల్దేరారు ఆమె వెంట భర్త అనిల్ ఉన్నారు. గతంలో వాడిన ఫోన్లను ఆమె చూపించారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం దగ్గర ఒకసారి.. ఈడీ ఆఫీసు ముందు మరోసారి రెండు కవర్లలో కొన్ని ఫోన్లను అందరికి చూపించారు. గతంలో కవిత ఆధారాలు దొరక్కుండా ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు వెళ్లే ముందు ఆ ఫోన్లు ప్రత్యేకంగా రెండు కవర్లలో వేసి చూపించడం విశేషం. మొదటిరోజు విచారణ రోజే కవిత వ్యక్తిగత ఫోన్ను ఈడీ సీజ్ చేసింది.