YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక కాంగ్రెస్ తొలి జాబితా

కర్ణాటక కాంగ్రెస్ తొలి జాబితా

బెంగళూరు, మార్చి 25, 
మేలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించింది.‘రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిటీ ఖరారు చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా ఇదే’ అంటూ పార్టీ అభ్యర్థుల జాబితాను ట్విటర్‌లో షేర్ చేసింది.తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్లు ఉన్నాయి. మాజీ సీఎం సొంత నియోజకవర్గమైన మైసూరులోని వరుణ అసెంబ్లీ స్థానం నుంచి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను కనకపుర నుంచి పోటీకి దింపాలని పార్టీ నిర్ణయించింది‘కర్ణాటక శాసనసభకు జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా పార్టీ ఎన్నికల కమిటీ 124 మందిని ఎంపిక చేసింది’ అని ఏఐసీసీ పత్రికా ప్రకటన తెలిపింది.యెమకనమర్డి నుంచి కాంగ్రెస్‌ నేతలు సతీష్‌ జార్కిహోళి, బెల్గాం రూరల్‌ నుంచి లక్ష్మీ హెబ్బాల్కర్‌, చితాపూర్‌ నుంచి ప్రియాంక్‌ ఖర్గే, శివాజీనగర్‌ నుంచి రిజ్వాన్‌ అర్షద్‌, గాంధీనగర్‌ నుంచి దినేశ్‌ గుండూరావు, నరసింహరాజు నుంచి తన్వీర్‌ సైత్‌, చామ్‌రాజ్‌పేట నుంచి బీజీ జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ తదితరులు జాబితాలో ఉన్నారు.

Related Posts