YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అసంతృప్త నేతలపై బాస్ దృష్టి

అసంతృప్త నేతలపై బాస్ దృష్టి

హైదరాబాద్, మాార్చి 25, 
ఎలక్షన్ టైమ్ దగ్గర పడుతుండడంతో అసంతృప్త నేతలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఎఫెక్ట్ రాబోయే ఎన్నికలపై పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందుకే అసంతృప్త నేతలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. పలు  నియోకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలపై అధినేత కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. అయితే రోజురోజుకు గ్రూపు రాజకీయాలు ఎక్కువ అవుతుండటంతో వాటికి చెక్ పెట్టేందుకే భద్రత కుదింపు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. సాఫ్ట్ కారణాలు చూపి గన్ మెన్లను వెనక్కి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఇలాంటి చర్యలతో అసంతృప్తులకు చెక్ పడుతుందా అనేది పార్టీలోనే చర్చనీయాంశమైందిఅందులో భాగంగా ముందుగా వారికి గన్ మెన్ల భద్రతను కుదిస్తున్నది.ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి సైతం గన్ మెన్లను ఉపసంహరించుకున్నది. కరోనా సమయంలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కేటాయించిన ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించింది. తాజాగా మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్యకు కేటాయించిన 2+2భద్రతను 1+1కు కుదించింది. దీంతో ఆయన ఆ భద్రత కూడా వద్దని వెనక్కి పంపారు. మరో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు ఉన్న 1+1 భద్రతను రద్దు చేసింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయి, ప్రస్తుతం భద్రాచలం పార్టీ ఇన్ చార్జిగా ఉన్న తెల్లం వెంకట్రావ్ కు ఉన్న భద్రతను సైతం రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. వీరితో పాటు గతంలోనే చాలా మందికి భద్రతను ఉపసంహరించుకున్నాదు. ఇంకా మరికొంత మందికి భద్రతను తొలగించేందుకు లిస్ట్ తయారైనట్లు తెలిసింది.
భద్రత ఉపసంహరించుకున్నంత మాత్రానా లాభం ఉండదని, వారిపై వేటు వేస్తేనే అసమ్మతికి చెక్ పడుతుందని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే భద్రత కుదిస్తున్నారని మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు

Related Posts