YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ

విజయవాడ
రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు చర్యలుకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, రాష్ట్రంలో  వివిధ ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు శనివారం కొనసాగాయి. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ దేశంలో కుల మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతుంది. మోడీ, అమిత్ షాలు దొంగలకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారు. వీరి అవినీతిని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. పార్లమెంటు లో కూడా వారిని అక్రమాలను ప్రశ్నిస్తారనే భయం వారిలో ఉంది. అందుకే సూరత్ కోర్టీ తీర్పు ఆధారాంగా పార్లమెంట్ లో అనుర్హుడిగా ప్రకటించారు. రెండేళ్లు జైలు శిక్ష పడిందనే సాకుతో.. ఇప్పటికిప్పుడు నిర్ణయిస్తారా. వేల కోట్ల రూపాయలు దోచుకున్న వారిని మాత్రం మోడీ కాపాడతారా . ఎన్నికలలో ధైర్యంగా ఎదుర్కోలేక గతంలో తప్పుడు కేసులు పెట్టారు. రాజ్యాంగ బద్దంగా ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని ఎలా అనర్హుడిగా ప్రకటిస్తారు. మోడీ, అమిత్ షాలు విధానాలపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా మా నాయకుడికి అండగా ఉంటాం. రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేకే.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరో్పించారు.

Related Posts