YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు.. ఒక్కతాటి మీదకు వస్తున్న ప్రతిపక్షాలు

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు.. ఒక్కతాటి మీదకు వస్తున్న ప్రతిపక్షాలు

న్యూ డిల్లీ మార్చ్ 27
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వ్యవహారంతో దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలను ఈ వ్యవహారం ఒక్కతాటి మీదకు తీసుకొస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కి దూరంగా ఉంటూ వస్తున్న పార్టీలు సైతం ఇప్పుడు కలిసి వస్తున్నాయి. నేటి ప్రతిపక్షాల సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సైతం హాజరుకానుండటం గమనార్హం. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల సమావేశాలకు టీఎంసీ దూరంగా ఉంటూ వస్తోంది. నేటి సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు జవహర్ సర్కార్, ప్రసూన్ బెనర్జీ హాజరుకానున్నారు.

Related Posts