మేడ్చల్
సీఎం కేసీఆర్ ను చూస్తే మోడీకి వణుకు అని, అందుకే బి.ఆర్.ఎస్. నాయకుల మీద ఈ.డి, బోడిలను ప్రయోగిస్తున్నారని కానీ ఎవ్వరికీ భయపడేది లేదన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చెల్ జిల్లా పీర్జదిగుడాలో మేడిపల్లి మండలానికి సంబంధించిన 58 జి.ఓ. నంబర్ 509 మంది లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి పట్టా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీర్జదిగుడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ బి.ఆర్.ఎస్. అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో వచ్చేది బి.ఆర్.ఎస్. ప్రభుత్వమేనని ఎవ్వరు ఏం అభివృద్ధి చేశారు ప్రజలకు తెలుసన్నారు మంత్రి మల్లారెడ్డి. బీజేపీ దొంగల పార్టీ అని ఎద్దేవా చేశారు.