YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

కవితకు మరోసారి ఈడీ పిలుపు

కవితకు మరోసారి ఈడీ పిలుపు

న్యూఢిల్లీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. మంగళవారం  ఢిల్లీ కార్యాలయానికి రావాలని కోరింది. ఈడీ పిలుపుపై  స్పందించిన కవిత.. ప్రతిగా తన లీగల్ అడ్వైజర్ను పంపించారు. కాగా మార్చి 11న ఎమ్మెల్సీ కవితకు చెందిన ఫోన్ను ఈడీ అధికారులు సీజ్ చేసిన విషమం తెలిసిందే.  ఈనెల 21న ఎమ్మెల్సీ తన 9ఫోన్లను ఈడీకి అందజేశారు. అయితే సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేసేందుకు సాక్షిగా కవిత గానీ, ఆమె ప్రతినిధి గానీ రావాలని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు లీగల్ అడ్వైజర్ కు ఆథరైజేషన్ ఇచ్చి  తన ప్రతినిధిగా ఈడీ కార్యాలయానికి విచారణకు పంపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇప్పటి వరకు మూడుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈనెల 11,20,21 తేదీల్లో ఈడీ ముందు విచారణను హజరయ్యారు.

Related Posts