హైదరాబాద్
తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు కెపిహెచ్బి జెఎన్టియు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పoచిపెట్టిన నాయకులు బాణాసంచా కాల్చి ఎన్టీఆర్ రామారావు అమర్ రహే తెలుగుదేశం జిందాబాద్ చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కాలనీలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు. కాలనీలోని ప్రతి దిమ్మ వద్ద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసారు.