హైదరాబాద్
బీఆర్ ఎస్ తో కాంగ్రెస్ పొత్తు వుంటుందని తాను చెప్పలేదని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి వివరణ ఇచ్చారు.
ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ.ప్రభుత్వం ఖునీ చేస్తున్న అంశం, రాహుల్ గాంధీ పై ఎంపీ గా అనర్హత వేటు వేయడం, ఆధాని లాంటి వాళ్ళు ప్రజాధనాన్ని లక్షల కోట్లు దోచుకొని పోవడం లాంటి అంశగాలపై మాట్లాడడం జరిగిందని అయన అన్నారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పొత్తులపై ప్రస్తావించినపుడు నేను క్లుప్తంగా మాట్లాడాను. ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ కి వ్యతిరేకంగా 17 రాజకీయ పార్టీలు కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేస్తున్నాయని ఆ అంశాన్ని స్వాగతిస్తున్నానని మాత్రమే చెప్పాను. నేను బీఆర్ ఎస్ తో పొత్తు ఉంటుందని చెప్పలేదు. పోతుల విషయం అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటుంది. అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యమని అయన అన్నారు.