వరంగల్
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చికి ఇంకా ధర కాలేదు. అయితే, ఏప్రిల్ నుండి 49 కిలోల లోపు 25 కిలోల పైన ఉన్న బస్తాలు కొనుగోలు చేస్తామని వ్యాపారస్తులు అనడంతో కాంటాలు నిలిచిపోయాయి. చాంబర్ ఆఫ్ కామర్స్ ఏకపక్ష నిర్ణయంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్ఆనయి. ఖమ్మం మార్కెట్ తరహా ఇక్కడ అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్లో 2010 నుండి గన్నిసంచులకు డబ్బులు వ్యాపారులు చెల్లిస్తున్నారు. కానీ వరంగల్ లో మాత్రం డబ్బులు చెల్లించడం లేదు. రైతుల నష్టపోయిన పర్వాలేదు తాము నష్టపోవద్దంటూ వ్యాపారుల ఇష్టానుసారాలతో ఛాంబర్ ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఛాంబర్, వ్యాపారుల తీరుతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.